సంక్షోభంలో జీవవైవిధ్య సంపద ఎందుకు? I "Biodiversity on the Brink: A Global Crisis in the Making"
ప్రకృతిలో ఏ జీవి ఒంటరిగా జీవించలేదు . ప్రతి ప్రాణి తన చుట్టూ ఉన్న పరిసరాలపై , ఇతర జీవరాశులపై ఆవాసం ఆహారం ప్రత్యుత్పత్తిల కోసం ఆధారపడుతుంది . ప్రకృతిలో మానవునితో సహా జీవులన్నీఎన్నో భేదాలను కలిగి ఉండి కూడా పరస్పరాధారిత జీవనం గడుపుతాయి . జీవులలో గల భేదాలన్నిటిని కలిపి జీవవైవిధ్యం ( బయో డైవర్సిటి ) అని పిలుస్తారు . ఇది భవిష్యత్ తరాలకు ఉమ్మడి ఆస్థి . మానవునికి ఆహారం ఆరోగ్యంలతో పాటు ఆర్థిక సామజిక నైతిక రసాత్మాక విలువలను పెంపోందిస్తుంది . నేడు అభివృద్ది ఆధునికత సాంకేతికతల పేరుతో మానవుడు మితిమీరిన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిలోని వివిధరకాలైన జీవుల వినాశనానికి పాల్పడుతున్నాడు . భూమిపై విపరీత వాతావరణ మార్పులు , భూతాపం , భూఅతిచల్లదనం , భారి అగ్నిపర్వతాల పేలుడు , గ్రహశకలాలు డీకోట్టడం వంటి కారణాల వల్ల ఇప్పటికే భూమిపై సుదీర్ఘ కాలవ్యవధులలో ఐదు మహాజీవ అంతర్ధాన సంఘటనలు జరిగాయి. ఈ సాముహిక జీవవినాశన ప్రక్రియలలో భూమిపై గల జీవులలలో ప్రతిసారి మూడొంతులకు పైగా జీవులు కనుమరుగు అయినాయి . సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఐదవమహావిలుప్తంల...