హరిత పర్యావరణవాదమే శ్రేయస్కరం
అనాది నుండి మానవుడు పర్యావరణ స్పృహ కలిగియుండి ప్రకృతితో మమేకమై జీవిస్తు ఉండేవాడు . కానీ నేడు మనిషి శాస్త్ర సాంకేతిక పరిశోధనలు నూతన
ఆవిష్కరణలతో ప్రకృతి గోళాన్ని మరిచి విజ్ఞానగోళంలో విహరిస్తున్నాడు
. సకల జీవరాశుల ఉమ్మడి ప్రయోజనాలను మరచి
అభివృద్ధి ఆధునికతల జీవనశైలి మాటున అత్యాశ అవసరాలు తీర్చుకోవడానికి
సహజ వనరులను విద్గ్వంసం చేస్తూ పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోతున్నాడు . భూఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్ళెం వేయాలన్న పారిస్
ఒప్పందం అమలు ఎండమావిగానే మిగిలిపోతున్నది . ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన
కల్పించేందుకు 1972లో స్టాక్హోమ్ ( స్వీడన్ ) లో యూఎన్ఓ అధ్వర్యంలో జరిగిన మానవుడు-
పర్యావరణం అంతర్జాతీయ సదస్సు లో ప్రతి
సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ) ను జరుపుకోవాలని సభ్యదేశాలు నిర్ణయించాయి . మొట్టమొదట 1973 జూన్ 5 "ఒకే ఒక భూమి" అనే నినాదంతో
ప్రపంచ పర్యావరణ దినమును ప్రపంచదేశాలన్నీ జరుపుకున్నాయి. ఈ
సంవత్సరం 2025 జూన్ 5న “ప్లాస్టిక్
కాలుష్యాన్ని అంతం చేయండి “ ( బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ) అనే ఇతివృత్తంతో
జరుపుకుంటున్నాము . ఈ ఏడాది 52వ ప్రపంచ
పర్యావరణ వేడుకలకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశం అతిధ్యమివ్వనున్నది . మన దేశంలోఒక
రోజు ముందుగానే వన్ నేషన్- వన్ మిషన్ –
ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదంతో
భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది . ఈ ప్రచారం భారత
దేశం యొక్క ప్రధానపర్యావరణ చొరవగా పరిగణించబడుతుంది . పర్యావరణ సానుకూల జీవనశైలి ( మిషన్ లైఫ్ ) తో అనుసంధానించబడిన పర్యావరణ
పరిరక్షణ మరియు స్థిరత్వం పట్ల భారతదేశం యొక్క అచంచలమైన నిబద్దతను ఈ నినాదం
ప్రతిబింభిస్తుంది . వాతావరణచర్య మహాసముద్రాలరక్షణ పర్యావరణ వ్యవస్థల
మరమ్మతులు జీవవైవిధ్యాన్ని నిలుపుకోవడం స్థిరమైన ఉత్పత్తి వినియోగం వంటి సుస్థిరాభివృద్ది
లక్ష్యాలను సాధించడంలో పర్యావరణ సంక్షోభాన్ని నివారించడంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం ఒక ముఖ్యమైన
సహకారంగా పనిచేస్తుంది . నేటి పర్యావరణ సంక్షోభానికి స్తూలంగా వాతావరణ మార్పు , మహమ్మారి వ్యాధుల వ్యాప్తి మరియు సాంకేతిక దండయాత్ర
అను మూడు ప్రధాన కారణాలుగా ఉన్నవి .
పర్యావరణసంక్షోభంలో మానవుడు :
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా అడవులను
విచక్షణారహితంగా నరికివేయడం కాలుష్యం గ్రీన్హౌస్
వాయువులఉద్గారాలు రేడియోధార్మికవ్యర్థాలు భూవినియోగ
విధానాల్లో మార్పులు మరియు భూకంపాలు , సునామీలు అగ్నిపర్వతాల
భారీవిస్ఫోటనాలు భూతాపం ఎల్ నినో లానినా , భూఅతిశీతల ప్రభావం ( గ్లోబల్
డిమ్మింగ్ ) హీట్ వేవ్స్ వంటి ప్రకృతి వైపరిత్యాలతో
పాటు విషవాయువుల
లీకేజీ అణుపేలుళ్లు వ్యవసాయంలో అపరిమిత రసాయనఎరువులు పురుగుమందుల
వినియోగం , గాలి నీరు భూమి కాలుష్యాల తీవ్రత
వంటి నిర్లక్ష్యపు చర్యలు భూమిపై వేగవంతమైన పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాయి. భూతాపం కారణంగా మంచు హిమనినదాలు కరుగడం వల్ల తీరప్రాంత
దేశాలలో మిలియన్ల మంది ప్రజలు పర్యావరణ శరణార్థులుగా మారుతారు . ఋతువులు గతి తప్పుతున్నాయి . మండుటెండలో
ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు విపరీతంగా
కాస్తున్నాయి . నదులు ఎండిపోయి నీరు దొరకదు . తీవ్రమైన వరదలు , వర్షాలు కలుగుతున్నాయి . కరోనా వంటి అంటువ్యాధులు
ప్రబలుతున్నాయి.
వాతావరణ మార్పుల కారణంగా
ప్రతి సంవత్సరం భూమి నుండి సుమారు పదివేల జీవ జాతులు అదృశ్యమవుతున్నాయి . ప్రముఖ అమెరికన్
పర్యావరణవేత్త డా. షన్నాస్వాన్ తన తాజాపుస్తకం కౌంట్ డౌన్ లో పేర్కొన్నట్లు మనం
నిత్యం ఉపయోగించే ఉత్పత్తులలో పాలీఫ్లోరోఅల్కైల్స్ థాలేట్స్ మరియు బిస్ఫినాల్ వంటి
ప్లాస్టిక్ విష రసాయనాల కాలుష్యం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం (ఫెర్టిలిటీ
కెపాసిటీ ) మానవులలో తగ్గిపోయి 2045 నాటికి మానవ మనుగడకు ముప్పు ఏర్పడనున్నది
. 21వ శతాబ్దంలో బయోటెక్ మరియు ఇన్ఫోటెక్ కలయిక
వల్ల ఎదురయ్యే సవాళ్లలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ డేటాసైన్స్ఇంటర్నెట్
ఆఫ్ థింగ్స్ మెషీన్ లెర్నింగ్ బయోఇంజినీరింగ్ టెక్నిక్స్ మరియు ఆటోమేషన్ వంటి
టెక్నాలజీ ముసుగులో జరుగుచున్న అణుయుద్ధాలు
, రసాయనఆయుధాల దాడి, సూక్ష్మజీవులతో దాడి ( బయోవార్) సైబర్
దాడి , ఫుడ్
టెర్రరిజం , అగ్రో టెర్రరిజం వల్ల వర్తమాన భవిష్యత్తులో పర్యావరణానికి మానవాళికి
పెనుప్రమాదం పొంచి ఉంది. పర్యావరణ సానుకూల నిర్ణయాలలో ప్రపంచ దేశాల్లో భారత్ పర్యావరణ దార్శనికత
మహోన్నతమైనది ఉంది .
భారతపర్యావరణ వ్యూహాత్మక గమనాలు :
భారతీయులు అనాది నుండి ప్రకృతి ప్రేమికులు .
వేదకాలం నుండి మానవులు ప్రకృతితో విలీనమై సామరస్యంగా జీవించేవారు . ప్రకృతిలోని మొక్కలను , జంతువులను అగ్ని నీరు గాలి భూమి లను దేవతలకు సింభాలిక్ గా
భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడేవారు . అధర్వణ వేదంలో పర్యావరణ పరిరక్షణ
గురించి... “ మాతా భూమి పుత్రోహం పృధ్వి వ్యా: పర్జ్యన్య : “ అని పేర్కొనబడింది . పర్యావరణానికి హాని కలిగించవద్దు నీరు మరియు వృక్షజాలానికి
హాని కలిగించవద్దు , భూమి నా తల్లి నేను ఆమె పుత్రున్ని జలాలు తాజాగా ఉండు గాక ,
చెట్లను నరికివేయవద్దు ఎందుకంటే అవి కాలుష్యాన్ని తొలగిస్తాయి అని చక్కగా వివరించబడింది . భూమి మనది కాదు మనం భూమికి
చెందిన వాళ్ళం అనే పర్యావరణతాత్విక నీతితో ఆనాటి నుండి మానవుడు ప్రకృతిని కాపాడుచున్నాడు . ప్రాచీన మద్య యుగాలలో పర్యావరణ పరిరక్షణ
భావనాత్మక అంశంగా ఉండేది . కానీ ఆధునిక
యుగంలో పారిశ్రామిక విప్లవం తరువాత సాధనాత్మక అంశంగా మారింది . ఈ క్రమంలో మన భారత
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు వాతావరణ మార్పులు కాలుష్యం వనరుల దుర్వినియోగంవంటి
సవాళ్ళను ఎదుకోర్కొనేందుకు అనేక వినూత్న పర్యావరణ చట్టాలు వ్యూహాత్మక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల్లో
ముందున్నది . భారత పర్యావరణ పరిరక్షణచట్టం- 1986 జల కాలుష్యనివారణ
చట్టం- 1974 జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం- 1983 లతో పాటు ఎకోమార్క్- 1991 నేషనల్
గ్రీన్ కార్ప్- 2001 మంగ్రోవ్స్ ఫర్ ది ఫ్యూచర్- 2006 నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్- 2010 నేషనల్ ఎలక్ట్రికల్
మొబిలిటీ మిషన్-2013 స్వచ్చ భారత్
అభియాన్- 2014 జలజీవన్ మిషన్- 2019 అటల్ భూజల్
యోజన- 2019 పిఏం కుసుమ్- 2019 పిఏం మత్స్య సంపద యోజన- 2019 నగర వన్ యోజన- 2020 అమృత్
ధరోహర్ యోజన- 2023 జాతీయ గ్రీన్ హైడ్రోజన్
మిషన్ - 2023 పియం ప్రాణం -2023 మిషన్ లైఫ్- 2022 గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం -2023 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం -2023 పియం సూర్య ఘర్ యోజన-2024 మిష్టి ప్రోగ్రాం- 2025 న్యూక్లియర్ ఎనర్జీ మిషన్- 2025 తదితర జాతీయ పర్యావరణ
అవిష్కరణలతో భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యవంతమైన హరిత భారతం (
గ్రీన్ ఇండియా ) ను అందించడం కొరకు కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయుచున్నవి . ఇందుకు ప్రజలలో విద్యార్థులలో హరితపర్యావరణవాదాన్ని
( గ్రీన్ ఎన్విరాన్మెంటలిజం ) బలంగా పెంపొందించవలసిన
అవసరం ఉంది .
హరితపర్యావరణవాదమే శ్రేయస్కరం :
ప్రజలలో పర్యావరణనీతి పర్యావరణవిలువ భూవినియోగవిచక్షణ జీవవైవిధ్యం జీవావరణం జీవాసక్తి ( బయోఫిలియా ) భావనలను పెంపొందించే
సమ్మిలిత ప్రయత్నమే పర్యావరణవాదం . మానవుడు ప్రకృతిని జయించాలనే
పేరుతో పర్యావరణవిధ్వంసానికి పాల్పడటమంటే
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడమే
అవుతుంది . కనుక పర్యావరణ పరిరక్షణకు వాయు కాలుష్యాన్ని నివారించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్
వాడకాన్ని నిషేదించాలి . హరితహారం ట్రీమిత్ర
ట్రీహగ్గింగ్ వంటి కార్యక్రమాల ద్వార చెట్లను
విరివిగా పెంచాలి. పరిశుభ్రమైన పరిసరాలు మరియు పర్యావరణాన్ని అందించడం
లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి కమ్యునిటీ క్లీన్ –అప్ కార్యక్రమంలో ప్రజలు నిరంతరం పాల్గొనాలి . త్రీ
ఆర్స్ (తగ్గించడం , పునర్వినియోగం చేయడం , రీసైకిల్
చేయడం) సూత్రాన్ని అనుసరించాలి . ప్రతి
వ్యక్తి పర్యావరణ జీవనశైలిలో భాగం కావాలి. ప్రజలకు విద్యార్థులలో
పర్యావరణ అక్షరాస్యత ద్వార
హరితపర్యావరణవాదాన్ని పెంచాలి . స్థానికత మరియు స్థానిక జీవన సంస్కృతులను పరిగణనలోకి
తీసుకోవాలి. పౌరులందరూ " ప్రపంచంగా ఆలోచించండి - స్థానికంగా
వ్యవహరించండి" అనే పదాలకు కట్టుబడి ఉండాలి . భూమిని ప్రకృతిని
మరియు పర్యావరణాన్ని రక్షించడంలో విజ్ఞత మరియు
విచక్షణను పాటించడం వల్ల పర్యావరణ
సంక్షోభాన్ని నివారింఛి హరిత ప్రపంచాన్ని నిర్మించగలం .
రచయిత:
డాక్టర్ భారత రవీందర్

Comments
Post a Comment